శ్రీవారి ఆలయ పెద్దజీయర్‌ స్వామికి కరోనా.. దర్శనాలు ఆపేస్తారా?

Webdunia
శనివారం, 18 జులై 2020 (10:26 IST)
క‌రోనా కేసులు తిరుప‌తి కొండ‌ను కుదిపేస్తున్నాయి.. తిరుమ‌ల‌లో ప‌రిస్థితులు రోజురోజుకీ తీవ్రంగా మారుతుండ‌డంతో..
pedda jeeyangar
భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నాల‌ను నిలిపివేసే ఆలోచ‌న‌లో ఉంది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ). ఇప్ప‌టికే శ్రీ‌వారి ఆల‌యానికి చెందిన 18 మంది అర్చ‌కుల‌కు క‌రోనా పాజిటివ్‌గా రావ‌డంతో పాటు పెద్ద జియ్యంగార్‌ కూడా క‌రోనా బారిన‌ ప‌డ‌డంతో ద‌ర్శ‌నాలు నిలిపివేయాల‌ని పాల‌క‌మండ‌లి భావిస్తోంది.
 
తాజాగా శ్రీవారి ఆలయ పెద్దజీయర్‌ స్వామికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో స్వామీజీని తిరుపతిలోని పద్మావతి క్వారంటైన్‌కు టీటీడీ అధికారులు తరలించారు. తిరుమలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో శ్రీవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసే అంశాన్ని దేవస్థాన అధికారులు పరిశీలిస్తున్నారు.
 
కాగా.. తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు తిరిగి ప్రారంభించిన త‌ర్వాతే క‌రోనా కేసులు పెరిగాయ‌ని.. టీటీడీ ఉద్యోగులు, స్థానికులు చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తిరుమ‌ల‌కు వ‌చ్చిన భ‌క్తులు ఎవ్వ‌రూ క‌రోనాబారిన ప‌డ‌క‌పోయినా.. పూజారుల నుంచి ఉద్యోగుల వ‌ర‌కు అనేక‌మంది క‌రోనా బాధితులుగా మారిపోయారు.
 
అర్చ‌కుల‌ను మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ద‌ర్శ‌నాలు కొన‌సాగిస్తే మ‌రిన్ని కేసులు పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని టీటీడీ భావిస్తోంది. దీంతో.. తాత్కాలికంగా ద‌ర్శ‌నాలు నిలిపివేసి.. శ్రీ‌వారికి ఏకాంతంగా పూజాకైంక‌ర్యాలు నిర్వహించాల‌ని టీటీడీ భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ కొత్త సినిమాకు విజయం టైటిల్ ఖరారు

అవి ఐటమ్ సాంగ్‌లు కాదు... ప్రత్యేక డ్యాన్స్ నంబర్లే : తమన్నా

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

తర్వాతి కథనం
Show comments