దేశంలో అత్యంత కారుచౌక కరోనా వ్యాక్సిన్ ఏది?

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (07:37 IST)
దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. వేలాది మందికి ఈ వైరస్ సోకుతోంది. ఈ క్రమంలో ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలుగా అనేక ఫార్మా కంపెనీలు వివిధ రకాలైన వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయి. ఇవి ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో మన దేశంలోనే మరో వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. 
 
హైదరాబాదుకు చెందిన బయోలాజికల్ ఇ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కోర్బెవాక్స్ కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం కేంద్రం అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. ఇది అన్ని అనుమతులు పొంది మార్కెట్లోకి వస్తే ఇప్పుడున్న అన్ని కరోనా వ్యాక్సిన్లలోకి ఇదే అత్యంత చౌకైన వ్యాక్సిన్ కానుంది. కోర్బెవాక్స్ సింగిల్ డోస్ ధరను బయోలాజికల్ ఇ సంస్థ రూ.250గా నిర్ణయించింది. అదే రెండు డోసులు అయితే రూ.400కే పొందవచ్చు. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల వెల్లడించారు.
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, ఇతర సంస్థల వ్యాక్సిన్లతో పోల్చితే ఇది తక్కువ ధర అని చెప్పాలి. సీరం ఇన్ స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే రేటు రూ.300 కాగా, ప్రైవేటు ఆసుపత్రుల వద్ద రూ.600 పలుకుతోంది. 
 
భారత్ బయోటెక్ తయారుచేసే కొవాగ్జిన్ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కి అందిస్తుండగా, దీని ధర ప్రైవేటు ఆసుపత్రుల వద్ద రూ.1,200గా ఉంది. ఇక, రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ఒక్క డోసు వెల రూ.995. వీటన్నింటితో పోల్చితే బయోలాజికల్ ఈ సంస్థ రూపొందించిన కోర్బెవాక్స్ చౌకైన వ్యాక్సిన్‌గా చెప్పుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్

VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.- అంచనాలు రెట్టింపు చేసిన టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

తర్వాతి కథనం
Show comments