Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై తరమణి ఆఫీసులో 40మందికి కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (15:04 IST)
తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసే కొందరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీందో ఉద్యోగులు షాకవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై, తరమణి, పెరుంగుడి, కందన్చావడి ప్రాంతాల్లో బ్రాంచ్ ఆఫీసులను కలిగివున్న ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన 40 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ కంపెనీలో పనిచేసిన ఉద్యోగులంతా కరోనా టెస్టుకు సిద్ధమవుతున్నారు. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఎన్నికల నేపథ్యంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. 
 
కరోనా మొదటి దశ కన్నా.. రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,951 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేవలం మహారాష్ట్రలోనే 30,535 కేసులు నమోదవ్వగా, పంజాబ్‌లో 2,644 కేసులు నమోదయ్యాయి. కరోనాబారిన పడి మరణించిన వారి సంఖ్య 200కు పైగా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 3.34 లక్షలకు పైగా ఉన్నాయి.
 
ప్రస్తుతం మహారాష్ట్రలో కేసుల సంఖ్య 24,79,682కు చేరింది. ఆ రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే 99 మంది కరోనాతో మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 53,399కు చేరింది. పూనెలో కొత్తగా 5,421 కేసులు నమోదయ్యాయి. ముంబైలో 3,775 కొత్త కోవిడ్‌ కేసులు నమోదవ్వగా, ముంబై సిటీలో మొత్తం 3.62 లక్షల కేసులు ఉండగా, అందులో యాక్టివ్‌ కేసులు 23,448గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments