Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్కోటి ఏకాదశి.. ఉప్పల్ కార్పొరేటర్ దంపతులకు కరోనా పాజిటివ్..

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (10:07 IST)
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడి కోలుకున్నారు. తాజాగా ఉప్పల్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ మందుముళ్ల రజితా పరమేశ్వర్‌రెడ్డి దంపతులు కరోనా బారినపడ్డారు. 
 
దంపతులిద్దరికీ కరోనా సోకినట్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని శుక్రవారం నిర్ధారణ అయినట్లు తెలిపారు. 
 
శుక్రవారం మధ్యాహ్నం నుంచి అన్ని రకాల కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితం అవుతున్నట్లు కార్పొరేటర్‌ దంపతులు ప్రకటించారు. వివిధ కార్యక్రమాల్లో తమతోపాటు పాల్గొన్న వారు కరోనా పరీక్షలు చేయించుకొని జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచించారు. 
 
శుక్రవారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని కార్పొరేటర్‌ దంపతులు ఉప్పల్‌లోని కరిగిరి వేంకటేశ్వరస్వామి ఆలయం, ఉప్పల్‌ రామాలయం, రామంతాపూర్‌లో సత్యనారాయణస్వామి ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments