తెలంగాణాలో కొత్తగా 338 మందికి కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (20:36 IST)
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 338 మందికి కరోనా వైరస్ సోకింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 24,113 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 338 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ కేసుల్లో అత్యధికంగా 135 మంది హైదరాబాద్ నగర పరిధిలోనే ఉన్నారు. అలాగే, రంగారెడ్డిలో 33, మల్కాజిగిరి జిల్లాలో 29 మందికి ఈ వైరస్ సోకింది. 
 
అదేసమయంలో 507 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే, గత 24 గంటల్లో కరోనా బాధితుల్లో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 8,32,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,26,269 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,553 మంది వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. 
 
అదేసమయంలో గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,649 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ వైరస్ వల్ల 36 మంది మృతి చెందారు. ప్రస్తుతం 96,442 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.62 శాతంగా ఉంది. అలాగే, 36 మంది చనిపోయారు. వీరితో కలుపుకుంటే మొత్తం మృతుల సంఖ్య 5,27,452కు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments