కరోనా వ్యాక్సిన్‌కు ముందు కోవిడ్ పరీక్ష తప్పనిసరి...

Webdunia
సోమవారం, 17 మే 2021 (08:54 IST)
కరోనా వ్యాక్సిన్ వేసుకునే ముందు కోవిడ్ పరీక్ష తప్పనిసరి చేయాలని దేశ ప్రజల్లో 48 మంది కోరుతున్నారు. 27 శాతం మంది కరోనా టెస్ట్‌ అవసరం లేదని చెప్పారు. టీకా వేసేముందు కరోనా టెస్ట్‌ చేయాలా..? వద్దా..? అని లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ ఓ సర్వే చేసింది. 
 
ఇందులో దేశవ్యాప్తంగా 278 జిల్లాల్లో ఉన్న 16 వేల మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు. కరోనా సోకిన వారు పూర్తిగా కోలుకున్న తర్వాతే టీకా తీసుకోవాలని అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(సీడీసీ) ఇది వరకే తెలిపింది. 
 
ఒకవేళ ఏదైనా ఆర్‌ఎన్‌ఏ టీకా మొదటి డోసు తీసుకున్నాక కొవిడ్‌ వస్తే.. వ్యాధి పూర్తిగా తగ్గాకే రెండో డోసుకు వెళ్లాలని సూచించింది. ఎసింప్టమాటిక్‌గా ఉన్న కొవిడ్‌ పాజిటివ్‌లు టీకా తీసుకుంటే వారి రోగనిరోధక శక్తి అతిగా ప్రేరేపించబడి కొవిడ్‌ కాస్త ఎక్కువ కావడం లేదా పరిస్థితి విషమించే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
'టీకా మొదటి లేదా రెండో డోసు తీసుకున్నాక మీకు తెలిసిన ఎంత మంది వారంలోనే కొవిడ్‌ బారినపడ్డారు' అని 7,946 మందిని ప్రశ్నించగా.. 20 శాతం మంది 5 లేదా ఎక్కువ మందికి ఇలా జరిగిందన్నారు. 15 శాతం మంది 3-4, 12 శాతం మంది ఇద్దరికి, 7 శాతం మంది ఒక్కరిని చూశామని వెల్లడించారు. 35 శాతం మంది ఇలాంటి కేసులను చూడలేదని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalki 2 shoot: కల్కి 2 తాజా అప్ డేట్ - ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పై సన్నివేశాల చిత్రీకరణ

Varalakshmi: వరలక్ష్మి ని చూసి బాలయ్య గారు ఊర్వశి శారద తో పోల్చారు : గోపీచంద్ మలినేని

బ్యాండ్ మేళం నుంచి ఎనర్జిటిక్ సాంగ్ తిప్పుకుంటన్నవ్ రిలీజ్

Trigun: త్రిగుణ్ హీరోగా లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఆకర్షిత చిత్రం ప్రారంభం

Anil Ravipudi : రీల్ లైఫ్ లో రియల్ లైఫ్ జంట కిల్లర్ లో ఆసక్తికరంగా ఉంది : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

తర్వాతి కథనం
Show comments