Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం క్యారంటైన్‍‌లో పుదుచ్చేరి సీఎంతో పాటు 51మంది ఉద్యోగులు

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (13:28 IST)
Puducherry CM
కరోనా పుదుచ్చేరిలో విజృంభిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా.. పేద, ధనిక బేధం లేకుండా కాటేస్తోంది. పుదుచ్చేరిలో ఇప్పటివరకు 648 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుండి 252 మంది కోలుకున్నారు. 
 
తాజాగా పుదుచ్చేరి సీఎంతో పాటు 51 మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో నెగటివ్ అని రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సీఎం నారాయణస్వామితో పాటు ఇంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అసెంబ్లీ ఉద్యోగులు 51 మందికి పీటీ-పీసీఆర్ పరీక్షలు చేశారు. 
 
అయితే రిపోర్టులో సీఎం నారాయణస్వామితో పాటు 51 మంది సీఎం కార్యాలయ ఉద్యోగులకు కరోనా నెగిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని పుదుచ్చేరి కుటుంబసంక్షేమశాఖ డైరెక్టరు మోహన్ కుమార్ చెప్పారు. అయినా ముందు జాగ్రత్తగా సీఎం నారాయణస్వామితోపాటు ఉద్యోగులకు వారంరోజుల పాటు హోంక్వారంటైన్ లో ఉండాలని సూచించామని డైరెక్టరు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments