కరోనా నుంచి కోలుకున్నా... గుండె, ఊపిరితిత్తుల్లో సమస్యలు.. జర జాగ్రత్త

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (11:00 IST)
కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ చికిత్స కోసం ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేని నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ పద్ధతుల్లో చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.
 
తాజాగా ఓ షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న తర్వాత కూడా.. వారిలో దీర్ఘకాల ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సమస్యలు వరుసగా వస్తున్నట్లుగా పరిశోధనల్లో వెల్లడవుతుండడంతో ఆందోళనలో మునిగిపోతున్నారు కరోనా వైరస్ బారిన పడిన బాధితులు.
 
ఇటీవలే ఇలాంటి ఓ ఆసక్తికర విషయం ఈ అధ్యయనంలో వెల్లడైంది. లండన్‌లోని యూరోపియన్ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 
 
ఆస్ట్రియాలోని పలు ఆసుపత్రిల్లో చికిత్స పొందిన 86 మంది కరోనా రోగులపై అధ్యయనం జరపగా... వారిని డిశ్చార్జ్ చేసిన అనంతరం వారిలో ఊపిరితిత్తుల సమస్యలు, గుండె పనితీరుకు సంబంధించిన సమస్యలు తలెత్తినట్లు అధ్యయనంలో గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. అందుకే కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నప్పటికీ... ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments