Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో టీకా వేయించుకున్న వెంకయ్య.. నాకు వ్యాక్సిన్ అక్కర్లేదన్న ఖర్గే

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (14:46 IST)
దేశంలో కరోనా రెండో దశ డ్రైవ్ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ డ్రైవ్‌లో 60 యేళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ టీకాలు వేస్తున్నారు. ఇందులోభాగంగా, ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కరోనా టీకా వేయించుకున్నారు. అలాగే, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాత్రం చెన్నైలో టీకా వేయించుకున్నారు. 
 
గత మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న వెంకయ్య.. సోమవారం ఉదయం చెన్నైలోని ప్రభుత్వ వైద్యకళాశాలలో ఏర్పాటుచేసిన కేంద్రంలో వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ విషయాన్ని తన ఫొటోలతో సహా ఆయనే ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. రెండో డోసును 28 రోజుల తర్వాత తీసుకోవాల్సి ఉంటుందని వెంకయ్య తెలిపారు. 
 
అర్హులైన వారందరూ కోవిడ్‌ వాక్సిన్‌ తీసుకుని కొవిడ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో భాగస్వాములు కావాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వివిధ దేశాలకు మన దేశం నుంచి కరోనా వ్యాక్సిన్‌ సరఫరా అవుతుండటం భారతీయుడిగా గర్విస్తున్నన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా వ్యాక్సిన్‌ సరఫరాకు మన దేశం ముందుకు రావడం హర్షించదగిన విషయమని ఆయన చెప్పారు.
 
మరోవైపు, కాంగ్రెస్ నేత‌, రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత అయిన మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ్యాక్సిన్ ముందుగా ఇవ్వాల్సింది వృద్ధుల‌కు కాదు.. యువ‌త‌కన్నారు. మీరు కూడా వ్యాక్సిన్ తీసుకుంటారా అని ప్ర‌శ్నించ‌గా.. నా వ‌య‌సు ఇప్ప‌టికే 70 దాటింది. వ్యాక్సిన్‌ను ముందుగా ఎక్కువ జీవిత‌కాలం ఉన్న యువ‌తీయువ‌కులు ఇవ్వాలి. నేను మ‌హా అయితే మ‌రో 10, 15 ఏళ్లు ఉంటాను అని ఖ‌ర్గే అనడం గ‌మ‌నార్హం. 
 
మ‌రోవైపు ఇప్ప‌టికే కొవిడ్‌-19 బారిన ప‌డిన హ‌ర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్‌.. త‌న‌కు వ్యాక్సిన్ అవ‌స‌రం లేద‌ని అన్నారు. కొవిడ్ వ‌చ్చిన త‌ర్వాతో త‌న‌లో యాంటీబాడీల సంఖ్య 300 వ‌ర‌కూ ఉన్న‌ద‌ని, ఇది చాలా ఎక్కువ‌ని ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టికిప్పుడు త‌న‌కు వ్యాక్సిన్ అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్నారు. ఈయ‌న గ‌తేడాది నవంబ‌ర్ 20న కొవాగ్జిన్ ట్ర‌య‌ల్ డోస్ తీసుకున్నారు. అయితే డిసెంబ‌ర్ 5న క‌రోనా బారిన ప‌డిఆసుప‌త్రిలో చేరారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments