Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న కేసులు.. 24 గంటల్లో 56వేల మందికి కరోనా

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (10:48 IST)
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో గత పది రోజులుగా 50వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 56 వేలకుపైగా కరోనా కేసులు రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసులు 20 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 56,282 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 19,64,537కు చేరింది. 
 
ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 5,95,501 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. మరో 13,28,337 మంది కోలుకున్నారు. తాజాగా కరోనా బారినపడినవారిలో 904 మంది మరణించారు. ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో బాధితులు మరణించడం ఇదే మొదటిసారి. దీంతో కరోనా మృతులు 40,699కు చేరారు. దేశంలో రికవరీ రేటు 67 శాతం దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
దేశంలో ఇప్పటివరకు 6,64,949 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. ఆగస్టు 5న 2,21,49,351 మందికి కరోనా పరీక్షలు చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments