Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న కేసులు.. 24 గంటల్లో 56వేల మందికి కరోనా

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (10:48 IST)
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో గత పది రోజులుగా 50వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 56 వేలకుపైగా కరోనా కేసులు రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసులు 20 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 56,282 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 19,64,537కు చేరింది. 
 
ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 5,95,501 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. మరో 13,28,337 మంది కోలుకున్నారు. తాజాగా కరోనా బారినపడినవారిలో 904 మంది మరణించారు. ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో బాధితులు మరణించడం ఇదే మొదటిసారి. దీంతో కరోనా మృతులు 40,699కు చేరారు. దేశంలో రికవరీ రేటు 67 శాతం దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
దేశంలో ఇప్పటివరకు 6,64,949 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. ఆగస్టు 5న 2,21,49,351 మందికి కరోనా పరీక్షలు చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments