Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో ఖరారైన తొలి కరోనా కేసు...

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (13:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. జిల్లా కేంద్రమైన నెల్లూరులో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వపరంగా జరగాల్సిన అనేక కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ రద్దు చేశారు. అలాగే, కరోనా వైరస్‌తో బాధపడుతున్న రోగిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
నెల్లూరు పట్టణం, చిన్నబజారుకు చెందిన 24 యేళ్ల యువకుడు 14 రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చాడు. అతడు నెల్లూరుకు వచ్చే సమయంలోనే జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో ఉన్నాడు. దీంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా, అతడిని పరీక్షించిన వైద్యులు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని భావించి, ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందించారు. 
 
ఆ తర్వాత అతని రక్తాన్ని సేకరించి పూణెలోని వైరాలజీ పరిశోధనాశాలకు పంపించారు. అక్కడ జరిపిన పరీక్షల్లో అతనికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆ జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నెల్లూరులో జరగాల్సిన పలు కార్యక్రమాలను వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments