Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ వైరస్‌తో అనారోగ్య సమస్యలు : ఆందోళనలో అధికారులు

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (11:17 IST)
కరోనా థర్డ్ వేవ్ సమయంలో అనేక మంది ఒమిక్రాన్ వైరస్ బారినపడి కోలుకున్నారు. ఇలాంటి పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఒమిక్రాన్ కోలుకున్న వారిలో పలువురికి వెన్నుపూస సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు గుర్తించారు. దీంతో ఏపీ వైద్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కోవిడ్ -19 నుంచి కోలుకున్న వ్యక్తులు మధుమేహంతో సహా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. డయాబెటిక్ రోగులలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయి. కోవిడ్-19 బారిన పడిన వారిలో 20 శాతం మంది మధుమేహ వ్యాధిబారినపడినట్టు తేలింది. 90 శాతం మంది ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యల బారినపడ్డారు. 
 
చాలా మంది కోవిడ్ కోలుకున్న వ్యక్తులు శరీర నొప్పులు, మోకాళ్ల నొప్పులు, జుట్టు రాలడం, ఇతర చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్టు వైద్య పరిశోధనలో తేలింది. ఒమిక్రాన్ వైరస్ బారినపడిన వారు కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని, పండ్లకు బదులు కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments