Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా దూకుడు - 33 వేలు దాటిన పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (09:58 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి దూకుడు మామూలుగా లేదు. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 33,750 మంది ఈ వైరస్ తాకిడికి గురయ్యారు. ఈ కేసులతో కలుపుకుంటే ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,49,22,882కు చేరింది. వీటిలో 1,45,582 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, తాజాగా 123 మంది కరోనా బాధితులు మృతి చెందారనీ, ఈ మృతుల సంఖ్యతో కలుపుకుంటే మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 4,81,893కు చేరినట్టు వెల్లడించారు. అలాగే, ఆదివారం 10846 మంది కోలుకున్నారు. 
 
అదేసమయంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆదివారం దేశంలో మరో 123 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1700కు చేరింది. ఈ వైరస్ బారినపడినవారిలో 639 మంది కోలుకున్నారు. 
 
దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, కేరళ, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ, కర్నాటక, హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments