Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా దూకుడు - 33 వేలు దాటిన పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (09:58 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి దూకుడు మామూలుగా లేదు. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 33,750 మంది ఈ వైరస్ తాకిడికి గురయ్యారు. ఈ కేసులతో కలుపుకుంటే ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,49,22,882కు చేరింది. వీటిలో 1,45,582 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, తాజాగా 123 మంది కరోనా బాధితులు మృతి చెందారనీ, ఈ మృతుల సంఖ్యతో కలుపుకుంటే మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 4,81,893కు చేరినట్టు వెల్లడించారు. అలాగే, ఆదివారం 10846 మంది కోలుకున్నారు. 
 
అదేసమయంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆదివారం దేశంలో మరో 123 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1700కు చేరింది. ఈ వైరస్ బారినపడినవారిలో 639 మంది కోలుకున్నారు. 
 
దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, కేరళ, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ, కర్నాటక, హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments