Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆప్ఘనిస్థాన్‌కు భారత్ సాయం : 5 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసుల‌ు తరలింపు

ఆప్ఘనిస్థాన్‌కు భారత్ సాయం : 5 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసుల‌ు తరలింపు
, శనివారం, 1 జనవరి 2022 (19:57 IST)
ఆప్ఘనిస్థాన్‌కు భారత్ సాయం చేసింది. క‌రోనా స‌మ‌యంలో భార‌త్ అనేక దేశాల‌కు మాన‌వ‌తా దృక్ప‌దంలో స‌హాయం చేసింది. అమెరికాతో స‌హా అనేక దేశాల‌కు మందుల‌ను స‌ప్లై చేసింది. తాజాగా తాలిబ‌న్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న ఆప్ఘనిస్థాన్‌కు కూడా సాయం అందించింది. 
 
ఇటీవ‌లే ఇండియా నుంచి గోధుమ‌ల‌ను కూడా ఆఫ్ఘ‌నిస్తాన్‌కు ఉచితంగా ఎగుమ‌తి చేసింది. అదే విధంగా ఇప్పుడు 5 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసుల‌ను ఆఫ్ఘ‌న్‌కు అందించింది.  శనివారం ఉద‌యం ఇండియా నుంచి స్పెష‌ల్ విమానంలో ఈ వ్యాక్సిన్‌ల‌ను కాబూల్‌కు చేర్చారు.  కాబూల్‌లోని ఇందిరాగాంధీ ఆసుప‌త్రికి ఈ వాక్సిన్ డోసుల‌ను త‌ర‌లిస్తున్నారు. 
 
కేవలం వ్యాక్సిన్ డోసులను మాత్రమే కాకుండా.. ఆఫ్ఘన్ ప్రజలకు ఆహార ధాన్యాలు మరియు అవసరమైన ప్రాణాలను రక్షించే మందులను కూడిన అందించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
"గత నెలలో 1.6 టన్నుల మెడికల్ ఎక్విప్ మెంట్ పంపించాం. రాబోయే వారాల్లో గోధుమల సరఫరా మరియు మిగిలిన వైద్య సహాయాన్ని చేపట్టనున్నాం. ఈ విషయంలో రవాణాకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడానికి ఐక్యరాజ్యసమితితో సంప్రదింపులు జరుపుతున్నాం" అని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉక్కిరి బిక్కిరి అయిన కంగనా రనౌత్.. ఏమైందంటే?