Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ సోకి ఒరిస్సా గవర్నరు సతీమణి కన్నుమూత

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (12:33 IST)
కరోనా వైరస్ మహమ్మారి అనేక మంది ప్రాణాలను హరిస్తోంది. ఇందులో అనేక మంది వీవీఐపీలు, సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా ఒరిస్సా రాష్ట్ర గవర్నరు గణేశీ లాల్ సతీమణి సుశీలా దేవి ఈ వైరస్ సోకి కోలుకున్న తర్వాత మళ్లీ తిరగబెట్టడంతో చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
 
రాష్ట్ర ప్రథమ పౌరురాలైన సుశీలాదేవి అందరినీ చక్కగా పలకరించేవారని, ఎంతో మర్యాదగా మెలిగేవారని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. గవర్నర్ గణేశీ లాల్‌, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన నవీన్ పట్నాయక్ ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. 
 
కరోనా వైరస్‌తో కొంతకాలంగా బాధపడుతూ వచ్చిన సుశీలా దేవి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్నారు. అయితే, ఈమెకు మళ్లీ ఈ వైరస్ పని చేయడం మొదలుపెట్టడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా ప్రస్తుతం గవర్నర్‌తోపాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
ఇంకోవైపు, దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో ఏకంగా 44,059 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 91 లక్షలు దాటింది. మొత్తమ్మీద దేశంలో 91,39,865 కరోనా కేసులు నమోదైనట్లు సమాచారం. 
 
అలాగే కొత్తగా 511మంది ఈ మహమ్మారికి బలయ్యారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,33,738కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,43,486 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మొత్తమ్మీద 85,62,641 మంది కరోనా పేషెంట్లు రికవర్ అయ్యారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments