Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా లాక్ డౌన్: ఇడ్లీ బామ్మ ఆగలేదు.. రూపాయికి రెండు ఇడ్లీలు..

Webdunia
మంగళవారం, 12 మే 2020 (18:55 IST)
Idly Grand mother
తమిళనాడులోని కోయంబత్తూర్‌ సమీపంలో ఉన్న వడివేలంపాలయం గ్రామానికి చెందిన 80 ఏళ్ల కమలాతాల్ ఒక్క రూపాయికే ఇడ్లీ అమ్ముతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇడ్లీ బామ్మ.. కరోనా కష్టకాలంలో తనకు తోచినంతలో ఇతరులకు సాయం చేస్తోంది. కరోనా వైరస్‌తో చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను ఆదుకుంటోంది. తాను చేసిన ఇడ్లీలను వలస కూలీలకు పెడుతూ ఎంతో పుణ్యం కట్టుకుంటోంది. 
 
లాక్ డౌన్ కారణంగా ఇడ్లీ వ్యాపారం అంతంతమాత్రంగా వున్నా.. బామ్మ మాత్రం రోజూ ఇడ్లీలు అమ్ముతోంది. గత 30 ఏళ్లుగా ఇడ్లీలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది ఈ 80 ఏళ్ల బామ్మ. ఇక కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాచినప్పటి నుంచి ఈ బామ్మ వ్యాపారం మరింతగా నష్టాల్లో కూరుకుపోయింది. అయితే ఈ సమయంలో ఆమెను ఆదుకునేందుకు వలస కూలీలు కూడా సహాయం చేస్తున్నారని చెప్పుకొచ్చింది. 
 
కొందరైతే ఇడ్లీ తయారీకి కావాల్సిన వస్తువులను పంపుతున్నారని గుర్తుచేసుకుంది. వారు పంపుతున్న సరుకులతో ఇడ్లీలు తయారు చేసి వలస కూలీలకు, పేద వారికి ఒక్క రూపాయికే అమ్ముతున్నట్లు వెల్లడించింది. గతంలో ఆ బామ్మ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments