Webdunia - Bharat's app for daily news and videos

Install App

యానాంలో మళ్లీ కర్ఫ్యూ - రాత్రి 11 నుంచి 5 గంటల వరకు అమలు

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (11:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా యానాంలో మళ్లీ రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూను విధించారు. ఇప్పటికే ఈ జిల్లాలో 133 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
దీంతో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్ర పరిధికి చెందిన యానాంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇందులోభాగంగా, కఠిన ఆంక్షలు అమలు చేస్తూ రాత్రిపూట కర్ఫ్యూను విధించారు. 
 
ఇదిలావుంటే ఏపీలోని 13 జిల్లాల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలోనే కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ జిల్లాలో 2,95,123మంది కరోనా వైరస్ బారినపడగా, 2,93,400 మంది కోలుకున్నారు. 1290 మంది మృత్యువాతపడ్డారు. 
 
ఆ తర్వాత స్థానంలో చిత్తూరు జిల్లా, మూడో స్థానంలో పశ్చిమగోదావరి జిల్లాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ కారణంగా అత్యధికంగా 1959 మంది మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 14495 మంది చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments