దడపుట్టిస్తున్న ఒమిక్రాన్ - కొత్త మార్గదర్శకాలు జారీ

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (17:33 IST)
దేశంలో కరోనా వైరస్ దడపుట్టిస్తుంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం ఒక్క రోజే తమిళనాడులో ఏకంగా 34 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. అలాగే, దేశ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కట్టడి కోసం కేంద్రం అప్రమత్తమైంది. కేసుల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరింది. 
 
ఈ వైరస్ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాలను కోవిడ్ క్లస్టర్లగా ఏర్పాటు చేసి, ఎప్పటికపుడు పర్యవేక్షించాలని, కోవిడ్ క్లస్టర్లలో కంటైన్మెంట్, బఫర్ జోన్లను ఏర్పాటు చేయాలని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీచేసింది. 
 
ముఖ్యంగా, పండగల సీజన్‌లో ఆంక్షలు, పరిమితులు విధించాలని, ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి టీకాలు వేయాలని సూచన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుబాయ్‌లో చిక్కుకున్న సినీ తారలు.. మంచు విష్ణు ఫ్యామిలీ దుబాయ్‌లో క్షేమంగా ఉండాలి

తండ్రిని అన్‌ఫాలో చేసిన విజయ్ కుమారుడు జాసన్ విజయ్

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి విశ్వనాథ్- సన్స్ టైటిల్

నేను పెళ్లి చేసుకునే ముందు.. నా అమ్మకు తోడు వుండాలి.. సుప్రీత

Varalaxmi: ఈ ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని శరత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments