Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా మృతులు 3847 - పాజిటివ్ కేసులు 2.11 లక్షలు

Webdunia
గురువారం, 27 మే 2021 (10:42 IST)
దేశంలో కరోనా వైరస్ సోకి ఏకంగా 3847 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, గత 24 గంటల్లో కొత్త‌గా 2,11,298 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... బుధవారం 2,83,135 మంది కోలుకున్నారు.
 
ఇకపోతే, దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,73,69,093కు చేరింది. మరో 3,847 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,15,235కు పెరిగింది. 
 
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,46,33,951 మంది కోలుకున్నారు. 24,19,907 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 20,26,95,874 మందికి వ్యాక్సిన్లు వేశారు.
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,120 శాంపిల్స్‌ను పరీక్షించగా 18,285 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా కారణంగా మరో 99 మంది చనిపోయారని వైద్యఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. 
 
దీంతో మొత్తం బాధితుల సంఖ్య 16,27,390కి, మొత్తం మరణాల సంఖ్య 10,427కి పెరిగింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 3,296 మందికి వైరస్‌ సోకగా.. అనంతపురంలో 1,876, చిత్తూరులో 1,822, విశాఖపట్నంలో 1,800, పశ్చిమగోదావరిలో 1,664, గుంటూరులో 1,211, శ్రీకాకుళంలో 1,207, నెల్లూరులో 1,159, ప్రకాశంలో 1,056, కర్నూలులో 1,026, కడపలో 877, కృష్ణాలో 652, విజయనగరంలో 639 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments