Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెరిగిన కరోనా కేసులు... ప్రపంచంలో రెండో దేశంగా భారత్

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (11:04 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారంతో పోల్చితే బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాలతో పోల్చితే ఈ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. 
 
మంగళవారం ప్రకటన మేరకు దేశంలో మొత్తం 2,55,874 పాజిటివ్ కేసులు నమోదుకాగా బుధవారం వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు 2,85,914కు చేరుకుంది. అలాగే, 665 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇదిలావుంటే, దేశంలో ఈ వైరస్ నుంచి 2,99,073 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో 22,23,018 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 16.16 శాతంగా ఉంది. 
 
ఇదిలావుంటే, గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఫలితంగా గత మూడు వారాల వ్యవధిలో ఏకంగా 50 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమలో దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు కోట్ల మార్కును దాటేసింది. దీంతో ప్రపంచంలో అత్యధిక కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన రెండో దేశంగా భారత్ నిలిచింది. 7.3 కోట్ల కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments