Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెరిగిన కరోనా కేసులు... ప్రపంచంలో రెండో దేశంగా భారత్

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (11:04 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారంతో పోల్చితే బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాలతో పోల్చితే ఈ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. 
 
మంగళవారం ప్రకటన మేరకు దేశంలో మొత్తం 2,55,874 పాజిటివ్ కేసులు నమోదుకాగా బుధవారం వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు 2,85,914కు చేరుకుంది. అలాగే, 665 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇదిలావుంటే, దేశంలో ఈ వైరస్ నుంచి 2,99,073 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో 22,23,018 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 16.16 శాతంగా ఉంది. 
 
ఇదిలావుంటే, గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఫలితంగా గత మూడు వారాల వ్యవధిలో ఏకంగా 50 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమలో దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు కోట్ల మార్కును దాటేసింది. దీంతో ప్రపంచంలో అత్యధిక కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన రెండో దేశంగా భారత్ నిలిచింది. 7.3 కోట్ల కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments