Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పూన్ గాడిద పాలు రూ. 100, తాగితే కరోనా పరార్ అంటున్నారు, ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (20:08 IST)
ఆవు పాలు, గేదె పాలు తాగడం సహజమే. పాలిచ్చే గాడిదలను తీసుకుని వచ్చి వాటి పాలు తీసి అమ్ముతున్నారు. ఈ పాలు తాగితే కరోనావైరస్, ఒమిక్రాన్ పారిపోతాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంకేముంది.. అంతా గాడిద పాల కోసం ఎగబడుతున్నారు. కరోనా తగ్గుతుందని ప్రచారం చేస్తుండటంతో జనం బారులు తీరారు.

 
ఇదంతా మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో జరుగుతోంది. గాడిద పాలకు కరోనాను అడ్డుకునే శక్తి వుందని ప్రచారం చేస్తుండటంతో జనం తండోపతండాలుగా వస్తున్నారు. దీనితో స్పూను గాడిద పాలు రూ. 100కి అమ్ముతున్నారు. లీటరు గాడిద పాలు కావాలంటే రూ.10,000 చెల్లించాలంటూ అడుగుతున్నారు. కొందరు అంత సొమ్ము ఇచ్చి గాడిద పాలు కొనుగోలు చేస్తున్నారు.

 
గాడిద పాలలో తల్లి పాలలో వుండే పోషకాలు వున్నప్పటికీ ఇది కరోనాను ఎదుర్కొంటుందంటూ ప్రచారం చేయడంపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా లక్షణాలున్నవారు వెంటనే ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. కానీ జనం మాత్రం గాడిద పాలను కొనడం ఆపడంలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments