Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా "మహా" విలయం.. ప్రతి 5 నిమిషాలకు ఒకరు మృతి... ఎక్కడ?

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (08:53 IST)
దేశంలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఇక్కడ ప్రతి రోజూ 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదతువున్నాయి. పైగా, ఈ వైరస్ ఇప్పట్లో ఉపశమించేలా కనిపించడంలేదు. ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ.. ఈ వైరస్ వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. 
 
గడచిన కొద్ది రోజులుగా వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలతో పాటు అనేక ఆంక్షలు విధిస్తున్నప్పటికీ కరోనా కేసుల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుదల కనిపించకపోవడంతో పాలకులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా రాష్ట్రంలో మరోమారు కొత్తగా 55 వేలకు మించిన కరోనా కేసులు వెలుగు చూశాయి. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 297 మంది మృతి చెందారు. 
 
అంతేకాకుండా, ఈ మృతుల లెక్కలను ఓసారి నిశితంగా పరిశీలిస్తే, ప్రతి ఐదు నిముషాలకు కరోనాతో ఒకరు మృతి చెందుతున్నారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కొత్తగా 55,469 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
ఇదేసమయంలో మొత్తం 34,256 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో గడచిన 24 గంటల్లో 10,030 కరోనా కేసులు నమోదయ్యాయి. 31 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మహానగరంలో ఇప్పటి వరకూ 4,72,332 మంది కరోనా బారినపడ్డారు.*.txt

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments