Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పంజా విసురుతున్న కరోనా.. అలెర్ట్ అవుతున్న రాష్ట్రాలు.. కర్ఫ్యూ ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (22:50 IST)
దేశంలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. యూరప్‌తో పాటు ఇతర దేశాల్లోనూ కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను తాకుతుందని వైద్యులు హెచ్చరిస్తున్న తరుణంలో ముందస్తు చర్యలు చేపడుతున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. కరోనా కట్టడికి మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే ఎలా ఉంటుందని ఓవైపు కొన్ని రాష్ట్రాలు ఆలోచన చేస్తున్నాయి. లాక్ డౌన్ దిశగా కొన్ని రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి.
 
మరోవైపు.. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలు మాత్రం కర్ఫ్యూ విధించాలని నిర్ణయించాయి. అయితే, ఈ కర్ఫ్యూ రాత్రి సమయంలో మాత్రమే అమలు చేయనున్నారు. నవంబర్‌ 21 నుంచి ఇండోర్‌, భోపాల్‌, గ్వాలియర్‌, విదిశ, రత్లామ్ జిల్లాల్లో కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని మహారాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ వెల్లడించారు. 
 
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. మరోవైపు.. గుజరాత్‌లోనూ శనివారం నుంచే కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాజ్‌కోట్‌, సూరత్‌, వడోదరలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు సీఎం నితిన్ పటేల్‌ ప్రకటించారు. ఇక, అహ్మదాబాద్‌లో శుక్రవారం రాత్రి నుంచి నవంబర్ 23వ తేదీ ఉదయం 6 గంటలకు సంపూర్ణంగా కర్ఫ్యూను అమల్లో ఉండనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments