Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్: ఆర్మీవార్‌ కాలేజ్‌లో 30 సైనిక అధికారులకు కరోనా

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (19:47 IST)
దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని మావ్‌లో ఆర్మీవార్‌ కాలేజ్‌కి చెందిన 30 మంది సైనిక అధికారులకు కరోనా సోకింది. ఇటీవల హయ్యర్‌ కమాండ్‌ శిక్షణ పూర్తిచేసుకొని తిరిగివచ్చిన 115 మంది అధికారులను కరోనా నిబంధనల ప్రకారం.. క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 
 
60శాంపిల్స్‌ను ఇండోర్‌లోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. 30మంది మిలటరీ అధికారులకు పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని అన్నారు. దీంతో తాత్కాలికంగా మూసివేశామని, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. 
 
అయితే పాజిటివ్‌ వచ్చిన సైనిక అధికారుల్లో కరోనా లక్షణాలు లేవని, అందరూ వ్యాక్సిన్‌లు తీసుకున్నారని ఇండోర్‌ చీఫ్‌ మెడికల్‌ అధికారి తెలిపారు. ప్రస్తుతం వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. కాగా, కాలేజ్‌లో వచ్చిన 30 కేసులతో పాటు మొత్తం ఇండోర్‌ జిల్లా వ్యాప్తంగా 32 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments