Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయా ఆసుపత్రి ఫౌండర్ బి.నాగిరెడ్డి మనవడు కరోనావైరస్‌తో కన్నుమూత

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (19:38 IST)
తెలుగు, తమిళ చిత్ర నిర్మాత, విజయా వాహిని స్టూడియో వ్యవస్థాపకుడు బి. నాగి రెడ్డి మనవడు శరత్ రెడ్డి శుక్రవారం ఉదయం కరోనావైరస్ కారణంగా చెన్నైలో కన్నుమూశారు. శరత్ రెడ్డి వయసు 52 సంవత్సరాలు. బి. నాగి రెడ్డి కుమారుడు విశ్వనాథారెడ్డి ఇద్దరు కుమారులలో ఆయన చిన్నవాడు.
 
కొద్ది రోజుల క్రితం కరోనావైరస్ లక్షణాలతో బాధపడుతున్న అతడిని వెంటనే చెన్నైలోని విజయ హెల్త్ కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శరత్ రెడ్డి తుది శ్వాస విడిచారు. విజయా ఆసుపత్రి వారి సొంతదే అయినప్పటికీ కరోనావైరస్ ముందు చేతులెత్తేసింది. దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు, కరోనావైరస్ ఎంతటి భయంకరమైనదో.
 
చలన చిత్రరంగంలో టాప్ ప్రొడ్యూసర్ అయిన బి. నాగి రెడ్డి చెన్నై నగరంలో విజయ వాహిని స్టూడియోను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇది అప్పటి ఆసియాలో అతిపెద్ద చలన చిత్ర స్టూడియో. నాగి రెడ్డి నిర్మించిన చిత్రాలు అప్పట్లో సంచలన విజయం చవిచూశాయి.
 
ఎన్టీఆర్ పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ తదితర చిత్రాలు ఆయన నిర్మించినవే. నాలుగు దశాబ్దాలలో యాభై సినిమాల దాకా నాలుగు దక్షిణ భారత భాషలలో నిర్మించారాయన. 1970 తర్వాత విజయ-వాహిని స్టూడియో మూసివేసి దాని స్థానంలో విజయ హాస్పిటల్, విజయ హెల్త్ కేర్ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments