Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టులూ జరజాగ్రత్త... సీఎం ప్రెస్‌మీట్‌కెళ్లిన విలేకరికి కరోనా

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (10:12 IST)
వర్కింగ్ జర్నలిస్టుల కాస్తంత వళ్లుదగ్గర పెట్టుకుని పనిచేయాలని కరోనా వైరస్ హెచ్చరించింది. కరోనా ఏం చేస్తుందిలే అని భావించి ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ తిరిగినా, ఇష్టానుసారంగా ప్రెస్‌మీట్లకు వెళ్లినా తాను సోకకుండా మానను అని హెచ్చరించింది. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌కు వెళ్లిన ఓ విలేకరికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఈ సమావేశానికి హాజరైన విలేఖరులందరినీ హౌస్ క్వారంటైన్‌కు పంపుతూ ఆదేశాలు జారీచేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన విషయం తెల్సిందే. అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మార్చి 20వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన జర్నలిస్టుకు తాజాగా ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు అదే సమావేశానికి హాజరైన మిగతా జర్నలిస్టులను హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలని సూచించారు. కాగా, బాధిత జర్నలిస్టుకు అతడి కుమార్తె ద్వారా ఈ వైరస్ సోకినట్టు అధికారులు నిర్ధారించారు.
 
మార్చి 17న ఆయన కుమార్తె లండన్ నుంచి వచ్చిందని, ఆమెతో ఉండడం వల్లే వైరస్ సోకి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆయన భార్య, కుమారుడికి పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది. 
 
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 519 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క భోపాల్‌లోనే 15 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments