Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయ్యి దాటిన ఒమిక్రాన్ కేసులు - ఒమిక్రాన్ హాట్‌స్పాట్‌గా మహారాష్ట్ర

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (13:13 IST)
దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యిదాటిపోయింది. తెలంగాణాలో కొత్తగా మరికొన్ని కేసులు వెలుగు చూశాయి. ముఖ్యంగా, ఒమిక్రాన్ హాట్‌స్పాట్‌గా మహారాష్ట్ర మారింది. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
ఇదిలావుంటే, దేశంలో ఈ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే 23 రాష్ట్రాలకు విస్తరించింది. దీంతో ఈ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య వెయ్యిదాటిపోయి 1270కు చేరింది. అయితే, ఈ వైరస్ బారినపడిన వారిలో ఇప్పటివరకు 374 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
అయితే, ఒమిక్రాన్ కేసులకు మహారాష్ట్ర కేంద్రంగా మారడం ఇపుడు ఆందోళన రేకెత్తిస్తుంది. ఈ ఒక్క రాష్ట్రంలోనే పాజిటివ్ కేసులు ఏకంగా 450కు చేరుకున్నాయి. అలాగే, ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్‌లో 97, రాజస్థాన్‌లో 69, తెలంగాణాలో 62 చొప్పున నమోదై వున్నాయి. 
 
మరోవైపు, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 16,764కు చేరాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,48,38,804కు చేరుకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments