Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. 2,219 మంది మృతి

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (10:06 IST)
భారత్‌లో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. కానీ పాజిటివ్ కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. వరుసగా రెండోరోజు లక్షకు దిగువన కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 92,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా...2,219 మంది మృతి చెందారు.

నిన్న ఒక్కరోజే 1,62,664 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో వ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,90,89,069కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 
 
ప్రస్తుతం 12,31,415 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా నుండి ఇప్పటి వరకు 2,75,04,126 మంది బాధితులు కోలుకున్నారు. కొవిడ్-19 వైరస్ సోకి ఇప్పటి వరకు 3,53,528 మంది మృతి చెందారు.

దేశవ్యాప్తంగా రికవరీ రేటు 94.55 శాతం కాగా, మరణాల రేటు 1.22శాతంగా ఉంది. ఇప్పటి వరకు 23,90,58,360 మందికి కరోనా టీకాలు వేయించుకున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments