Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు నెలల పాటు 100కిలో మీటర్లు.. 4 నదులు దాటిన పులి

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (10:00 IST)
పశ్చిమ బెంగాల్‌లో అదృశ్యమైన ఓ పులి కొండలు, కోనలు దాటుకుంటూ నాలుగు నెలలపాటు వంద కిలోమీటర్లు ప్రయాణించి బంగ్లాదేశ్ చేరుకుంది. పులి తన ప్రయాణంలో నాలుగైదు నదులు, మూడు దీవులను దాటింది. అది తన ప్రయాణంలో ఎక్కడా జనావాసాల్లో చొరబడకపోవడం గమనార్హం. 
 
బెంగాల్ అడవుల నుంచి అదృశ్యమైన ఈ పులి ఆచూకీని దాని మెడకు అమర్చిన రేడియో ట్యాగింగ్ పరికరం ద్వారా అటవీ అధికారులు కనుగొన్నారు. సుందర్బన్ అడవుల్లో కనిపించిన ఈ పులికి గతేడాదే ఈ పరికరాన్ని అమర్చారు. ఇప్పుడు అదే దాని ఆచూకీని తెలిపింది. అలాగే, ఒకవేళ ఆ పులి కనుక మరణిస్తే ఆ విషయాన్ని తెలియజేసేందుకు కూడా ఓ సెన్సార్‌ను అమర్చారు.
 
బెంగాల్ అడవుల నుంచి బయలుదేరిన ఈ పులి బంగ్లాదేశ్‌ వైపుగా వెళ్తూ గత నెల 11న ఆ దేశంలోని తల్‌పాట్టి దీవికి చేరుకుంది. ఆ తర్వాత రేడియో ట్యాగింగ్ పరికరం పనిచేయడం మానేసింది. దీంతో దాని ఆచూకీ కనుగొనడం కష్టమైంది. 
 
తాజాగా, ఆ పులి బంగ్లాదేశ్‌లోని సుందర్బన్ అడవుల్లో ఉన్నట్టు గుర్తించారు. గతంలో అది అక్కడి నుంచే పశ్చిమ బెంగాల్ అడవుల్లోకి వచ్చి ఉంటుందని, ఇప్పుడు మళ్లీ అది సొంత ప్రాంతానికి చేరుకుని ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments