Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పైపైకి...

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (10:39 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఉండే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 8084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,30,101కు చేరుకున్నాయి. ఇందులో 4,26,57,335 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, మన దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు 5,24,771 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఆదివారం ఉదయం రాత్రి 12 గంటల వరకు 10 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 4,592 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. కాగా, కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా 2,946 కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత కేరళలో 4,319, ఢిల్లీలో 735, కర్నాటకలో 436, హర్యానాలో 304 చొప్పున కేసులు ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల 0.11 శాతంగా ఉండగా రికవరీ రేటు 98.68 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments