Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 1.27 లక్షల కరోనా కొత్త కేసులు: తగ్గుతున్న పాజిటిటి రేటు

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (13:43 IST)
దేశంలో శనివారం 1,27,952 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,20,80,664కి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

 
గత 24 గంటల్లో దేశంలో 1,059 కొత్త మరణాలు నమోదయ్యాయి. దీనితో కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,01,114కు చేరుకుంది. భారతదేశం యాక్టివ్ కేసులు ప్రస్తుతం 13,31,648 వద్ద ఉంది. ఇది దేశంలోని మొత్తం పాజిటివ్ కేసులలో 3.16 శాతంగా ఉంది.

 
జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 95.64 శాతం ఉండగా, పాజిటివిటీ రేటు కూడా 7.98 శాతానికి పడిపోయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు కూడా 11.21 శాతానికి తగ్గింది. గత 24 గంటల్లో 2,30,814 రికవరీలు నమోదయ్యాయి. దీనితో కోలుకున్న రోగుల సంఖ్య 4,02,47,902కి చేరుకుంది. 

 
గత 24 గంటల్లో మొత్తం 16,03,856 పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకు 73.79 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 47,53,081 వ్యాక్సిన్ డోస్‌లు వేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments