Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి నుంచి నాజల్ డ్రాప్​ వ్యాక్సిన్​ తొలిదశ ట్రయల్స్

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (13:57 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడుగా కొన్ని టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీకాల వినియోగం త్వరలోనే ప్రారంభంకానుంది. అయితే, భారత్ బయోటెక్‌ కొవాగ్జిన్‌తో పాటు ముక్కుద్వారా వేసే టీకా అభివృద్ధి చేస్తోంది. ఇది ఫిబ్రవరి - మార్చిలో అందుబాటులోకిరానుంది.
 
తొలిదశ క్లినికల్ ట్రయల్ ఫిబ్రవరి - మార్చి నెలల్లో పూర్తి చేయనుంది. వాషింగ్టన్ వర్శిటీ స్కూల్‌ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి ఈ టీకాను అభివృద్ధి చేసినట్టు సమాచారం. పైగా, ఇప్పటికే దేశంలో అత్యవసర వినియోగానికి కొవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది కూడా. 
 
అయితే, ఫిబ్రవరిలో అందుబాటులోకి రానున్న నాజల్ టీకా ఒక్క డోసు మాత్రమే వేసుకుంటే సరిపోతుందని వైద్యులు అంటున్నారు. ఇప్పటికే ముక్కుద్వారా ఇచ్చే టీకా ప్రీక్లినికల్ పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ నాజల్ టీకా అందుబాటులోకి వస్తే మెడికల్ వ్యర్థాలు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఇదిలావుంటే, ఏపీలో మరోసారి కొవిడ్‌ వ్యాక్సినేషన్ డ్రైరన్‌ నిర్వహించారు. ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకూ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది. రాష్ట్రంలో శుక్రవారం మరోసారి కరోనా వ్యాక్సినేషన్ డ్రైరన్‌ ప్రక్రియ నిర్వహించారు. 
 
ప్రభుత్వం ఎంపిక చేసిన కేంద్రాల్లో డ్రై రన్‌ ఏర్పాటు చేశారు. కడప జిల్లాలోని 108 వైద్య కేంద్రాలు, గుంటూరులోని నరసరావుపేట, కృష్ణా జిల్లా నందిగామలోని ప్రభుత్వాస్పత్రిలో డ్రైరన్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
 
తొలుత టీకా వేయించుకునే వారికి వైద్యులు వ్యాక్సినేషన్‌ తీరుపై సూచనలు, సలహాలు ఇచ్చారు. టీకా వేసిన అరగంటసేపు పరిశీలన గదిలో ఉంచి.. ఎలాంటి ఇబ్బంది లేదని తెలిసాకే ఇంటికి పంపించినట్లు వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments