Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 20కి చేరిన మరణాలు.. మొత్తం కేసులు 727

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (09:58 IST)
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారానికి దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య 727కు చేరింది. అలాగే, ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య కూడా 20కి చేరింది. ఒక్క గురువారం రోజే కొవిడ్-19తో  ఏడుగురు రోగులు మరణించారు. 
 
దేశవ్యాప్తంగా ఒక్కరోజే మరో 71 కరోనా కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మరో నాలుగు కొత్త కరోనా కేసులు బయటపడటంతో దేశంలో కొవిడ్-19 పాజిటివ్ రోగుల సంఖ్య 727కు పెరిగింది. కరోనా రోగుల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో అప్రమత్తమైన సర్కారు లాక్ డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. 
 
మరోవైపు, కరోనా పాజిటివ్ కేసుల విషయంలో అమెరికా ఇప్పుడు ఇటలీ, చైనాలను అధిగమించింది. గత సంవత్సరం డిసెంబరులో చైనాలోని వూహాన్‌లో తొలిసారిగా ఈ వైరస్ వెలుగులోకి రాగా, ప్రస్తుతం చైనాలో పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకుంది. 
 
ఆపై ఇటలీలో కేసుల సంఖ్య వందల నుంచి వేలకు పెరుగగా, ఇప్పుడా స్థానాన్ని అమెరికా ఆక్రమించింది. అమెరికాలో గురువారం నాటికి 83 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 5 లక్షలకు చేరగా, 23,293 వేల మంది ఇప్పటివరకూ మరణించారు. అమెరికాలో మరణాల సంఖ్య 1,178కి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments