Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 20కి చేరిన మరణాలు.. మొత్తం కేసులు 727

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (09:58 IST)
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారానికి దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య 727కు చేరింది. అలాగే, ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య కూడా 20కి చేరింది. ఒక్క గురువారం రోజే కొవిడ్-19తో  ఏడుగురు రోగులు మరణించారు. 
 
దేశవ్యాప్తంగా ఒక్కరోజే మరో 71 కరోనా కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మరో నాలుగు కొత్త కరోనా కేసులు బయటపడటంతో దేశంలో కొవిడ్-19 పాజిటివ్ రోగుల సంఖ్య 727కు పెరిగింది. కరోనా రోగుల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో అప్రమత్తమైన సర్కారు లాక్ డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. 
 
మరోవైపు, కరోనా పాజిటివ్ కేసుల విషయంలో అమెరికా ఇప్పుడు ఇటలీ, చైనాలను అధిగమించింది. గత సంవత్సరం డిసెంబరులో చైనాలోని వూహాన్‌లో తొలిసారిగా ఈ వైరస్ వెలుగులోకి రాగా, ప్రస్తుతం చైనాలో పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకుంది. 
 
ఆపై ఇటలీలో కేసుల సంఖ్య వందల నుంచి వేలకు పెరుగగా, ఇప్పుడా స్థానాన్ని అమెరికా ఆక్రమించింది. అమెరికాలో గురువారం నాటికి 83 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 5 లక్షలకు చేరగా, 23,293 వేల మంది ఇప్పటివరకూ మరణించారు. అమెరికాలో మరణాల సంఖ్య 1,178కి చేరింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments