Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 20కి చేరిన మరణాలు.. మొత్తం కేసులు 727

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (09:58 IST)
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారానికి దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య 727కు చేరింది. అలాగే, ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య కూడా 20కి చేరింది. ఒక్క గురువారం రోజే కొవిడ్-19తో  ఏడుగురు రోగులు మరణించారు. 
 
దేశవ్యాప్తంగా ఒక్కరోజే మరో 71 కరోనా కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మరో నాలుగు కొత్త కరోనా కేసులు బయటపడటంతో దేశంలో కొవిడ్-19 పాజిటివ్ రోగుల సంఖ్య 727కు పెరిగింది. కరోనా రోగుల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో అప్రమత్తమైన సర్కారు లాక్ డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. 
 
మరోవైపు, కరోనా పాజిటివ్ కేసుల విషయంలో అమెరికా ఇప్పుడు ఇటలీ, చైనాలను అధిగమించింది. గత సంవత్సరం డిసెంబరులో చైనాలోని వూహాన్‌లో తొలిసారిగా ఈ వైరస్ వెలుగులోకి రాగా, ప్రస్తుతం చైనాలో పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకుంది. 
 
ఆపై ఇటలీలో కేసుల సంఖ్య వందల నుంచి వేలకు పెరుగగా, ఇప్పుడా స్థానాన్ని అమెరికా ఆక్రమించింది. అమెరికాలో గురువారం నాటికి 83 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 5 లక్షలకు చేరగా, 23,293 వేల మంది ఇప్పటివరకూ మరణించారు. అమెరికాలో మరణాల సంఖ్య 1,178కి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారు : అన్నపూర్ణమ్మ

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments