Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ల పరారీ.. బాత్ రూమ్ గ్రిల్స్ తొలగించి ఖైదీలు..?

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (11:20 IST)
గాంధీ ఆస్పత్రిలో మరోసారి కరోనా బాధితులు కలకలం రేపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు కరోనా బాధితులు పరారయ్యారు. పారిపోయిన నలుగురు చర్లపల్లి జైల్లో ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్నారు. అక్కడ ఉన్న ఎస్కార్ట్ సిబ్బంది కళ్లుగప్పి నలుగురు కూడా పారిపోయారు. 
 
ఈ విషయాన్ని అక్కడి సిబ్బంది ఆలస్యంగా గుర్తించారు. దీంతో పారిపోయిన ఖైదీల కోసం పోలీసులు స్పెషల్ టీంగా ఏర్పడి గాలిస్తున్నారు. ఈ నలుగురు ఖైదీలకు కరోనా సోకడంతో జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో వైద్యం కోసం అడ్మిట్ చేశారు. 
 
తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఆస్పత్రి నుండి ఖైదీలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. గాంధీ ఆస్పత్రి మెయిన్ బిల్డింగ్‌లోని రెండవ అంతస్తులో బాత్ రూమ్ గ్రిల్స్ తొలగించి ఖైదీలు పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. పారిపోయిన నలుగురు ఖైదీలు సోమసుందర్, పి. నర్సింహ, మొమహ్మద్ అబ్దుల్ అర్బాజ్, జావిద్‌గా సమాచారం. ఈ నలుగురు కోసం ఇప్పుడు పోలీస్ సిబ్బంది గాలింపును ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments