Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను జయించిన బాలుడు.. ఎక్మో చికిత్స సక్సెస్

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (13:55 IST)
boy
యూపీకి చెందిన ఓ బాలుడు కరోనాను జయించాడు. భారత్‌లో ఎక్మో చికిత్సతో ప్రాణాలతో నిలిచిన వ్యక్తి ఈ బాలుడే కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..  లక్నోకు చెందిన 12 ఏళ్ల బాలుడు శ్వాస సమస్యతో బాధ పడుతుండడంతో మొదట స్థానికంగా ఒక ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉన్నందున అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ కిమ్స్‌కు ఎయిర్ అంబులెన్స్‌లో తరలించారు తల్లిదండ్రులు.
 
పరీక్షల్లో ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నట్లు గుర్తించిన వైద్యులు వెనో వీనస్ ఎక్మో పరికరంతో రెండు నెలల పాటు కృత్రిమంగా శ్వాస అందిస్తూ.. క్రమంగా ఆరోగ్య పరిస్థితిని కుదుటపడేలా చేశారు. వైద్యుల చికిత్సతో ఊపిరితిత్తులు క్రమంగా మెరుగవడంతో.. ఎక్మో సాయాన్ని క్రమంగా నిలిపివేశారు. 
 
దేశంలో ఎక్మో చికిత్సపై ఎక్కువ రోజుల పాటు ఉండి, ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి ఇతడేనని వైద్యులు తెలిపారు. పోషకాహారాన్ని పెంచి ఇవ్వడం, ఫిజికల్ రీహాబిలిటేషన్, అడ్వాన్స్ డ్ లంగ్ రికవరీ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments