Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్‌‌ 19 రోగుల కోసం ‘ఫవివిర్’ను భారత్‌లో విడుదల చేసిన హెటిరో

Webdunia
బుధవారం, 29 జులై 2020 (14:32 IST)
ప్రపంచంలోనే అత్యధికంగా వైరస్ నిరోధక ఔషధాలను తయారుచేసే ప్రముఖ ఇండియన్ జెనరిక్ ఫార్మా కంపెనీ హెటిరో ఫవిపిరవిర్ జెనరిక్ ఔషధాన్ని ప్రకటించింది. దీనిని ‘‘ఫవివిర్’ పేరుతో విక్రయిస్తుంది. ఫవిఫిరవిర్ తయారీ, మార్కెటింగ్ కోసం హెటిరోకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) అనుమతులు ఇచ్చింది.
 
 కోవిడ్-19 బాధితుల కోసం ఇదివరకే కోవిఫర్ (రెమ్డిసివిర్)ను హెటిరో అభివృద్ధి చేసింది. ఫవివిర్ రెండో ఔషధం. ఇది నోటి ద్వారా తీసుకునే వైరస్ నిరోధక మాత్ర. ఈ మాత్రలపై నిర్వహించిన క్లినికల్ ప్రయోగాల్లో సంతృప్తికర ఫలితాలు వచ్చాయి. స్వల్పస్థాయి నుంచి మోస్తరుస్థాయి లక్షణాలు ఉన్న కోవిడ్-19 బాధితుల చికిత్స కోసం ఈ ఔషధం ఉపయోగపడుతుంది. హెటిరో ఫవివిర్ ఒక్కో మాత్ర ధర రూ.59 ఉంటుంది. దీనిని హెటిరో హెల్త్కేర్ లిమిటెడ్ విక్రయిస్తుంది. 
 
దేశవ్యాప్తంగా అన్ని ఔషధ దుకాణాల్లో, ఆస్పత్రుల్లో ఔషధాల దుకాణాల్లో బుధవారం నుంచే ఈ మాత్రలు అందుబాటులో ఉంటాయి. వీటిని కొనాలంటే డాక్టర్ రాసిన మందు చీటి తప్పనిసరి.
 
పటిష్టమైన సదుపాయాలు ఉన్న హెటిరో, ఫవివిర్ మాత్రలను ఇండియాలోనే తయారు చేస్తోంది. కఠినమైన ప్రమాణాలు, నియమాలు పాటించే యూఎస్ఎఫ్డీఏ, ఈయూ వంటి అంతర్జాతీయ నియంత్రణా ప్రాధికార సంస్థలు ఈ మందుకు అనుమతి ఇచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments