Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం, బ్యాంకు ఉద్యోగి మృతి

Webdunia
బుధవారం, 29 జులై 2020 (14:03 IST)
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బ్యాంకు ఉద్యోగి మృతి చెందారు. ఒకరు సజీవ దహనం అయ్యారు. నంద్యాల సమీపంలో శాంతిరాం ఆస్పత్రి సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ముగ్గురు బయటకు రావడానికి ప్రయత్నించగా ఒకరు తప్పించుకోలేక కారులోనే సజీవ దహనం అయ్యారు.
 
మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో సజీవ దహనమైన వ్యక్తి నంద్యాల పట్టణంలో ఎస్బీఐ ఉద్యోగి శివకుమార్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసారు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
మృతుడు శివకుమార్ స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల మండలం రైతు నగరం కాగా నంద్యాల ఎస్బీఐ బ్యాంకులో పనిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments