Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం, బ్యాంకు ఉద్యోగి మృతి

Webdunia
బుధవారం, 29 జులై 2020 (14:03 IST)
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బ్యాంకు ఉద్యోగి మృతి చెందారు. ఒకరు సజీవ దహనం అయ్యారు. నంద్యాల సమీపంలో శాంతిరాం ఆస్పత్రి సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ముగ్గురు బయటకు రావడానికి ప్రయత్నించగా ఒకరు తప్పించుకోలేక కారులోనే సజీవ దహనం అయ్యారు.
 
మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో సజీవ దహనమైన వ్యక్తి నంద్యాల పట్టణంలో ఎస్బీఐ ఉద్యోగి శివకుమార్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసారు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
మృతుడు శివకుమార్ స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల మండలం రైతు నగరం కాగా నంద్యాల ఎస్బీఐ బ్యాంకులో పనిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments