Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్టల్‌లో 37మంది విద్యార్థులు, నలుగురు సిబ్బందికి కరోనా

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (18:54 IST)
కరోనా జనాలకు నిద్రలేకుండా చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. దేశంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా హయత్‌నగర్‌లో కరోనా కలకలం రేగింది. సోషల్ వెల్ఫేర్ గురుకుల జూనియర్ కాలేజీ హాస్టల్‌లో 37మంది విద్యార్థులు, నలుగురు సిబ్బందికి కరోనా సోకింది. హాస్టల్లో మొత్తం 400 మంది విద్యార్థులు ఉన్నారు. 
 
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని హాస్టళ్లలో, స్కూల్‌లలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు తిరిగి ప్రారంభమైన తర్వాత కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
 
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులను సైతం కరోనా వెంటాడుతోంది. విద్యార్థులను బడికి పంపడానికే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా మహమ్మారికి కోనరావుపేటలోని కస్తూర్భా పాఠశాలలోని 15మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. 
 
వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సైతం కరోనాకు గురయ్యారు. కరోనా భయం పోతుందనుకున్న దశలో జిల్లాలో మళ్లీ గడగడలాడిస్తుండడంతో విద్యార్థులను పాఠశాలకు పంపడానికి భయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments