Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకిందన్న భయంతో విద్యాశాఖ సూపరింటెండెంట్ ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (09:28 IST)
కరోనా వైరస్ సోకిందన్న  భయంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖలో సూపరింటెండెంట్ హోదాలా పని చేస్తుండటం గమనార్హం. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ కాలనీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన మామిడాల రాజా వెంకటరమణ (54) మంచిర్యాల విద్యాశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ భార్య, కుమారుడితో కలిసి అక్కడే ఉంటున్నారు. 
 
అయితే, గత ఐదు రోజులుగా ఆయన జ్వరం, జలుబుతో బాధపడుతూ వచ్చాడు. దీంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నారు. పరీక్షించిన వైద్యుడు ఎందుకైనా మంచిదని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. 
 
దీంతో ఆయన భయపడిపోయారు. తనకు ఖచ్చితంగా కరోనా సోకివుంటుందని అనుమానించిన వెంకటరమణ.. అదే రోజు సాయంత్రం వరకు విధులు నిర్వర్తించి, అక్కడి నుంచి ఇంటికి వెళ్లకుండా నేరుగా కరీంనగర్‌లో తన ఇంటికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఉదయం విధులకు వెళ్లిన తండ్రి రాత్రయినా ఇంటికి రాకపోవడంతో అనుమానించిన ఆయన కుమారుడు విశ్వజిత్ కరీంనగర్‌లోని బంధువులకు ఫోన్‌లో విషయం చెప్పాడు. వారు అతడి ఇంటికి వెళ్లి చూడగా వెంకటరమణ ఉరికి వేలాడుతూ కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments