Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకిందన్న భయంతో విద్యాశాఖ సూపరింటెండెంట్ ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (09:28 IST)
కరోనా వైరస్ సోకిందన్న  భయంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖలో సూపరింటెండెంట్ హోదాలా పని చేస్తుండటం గమనార్హం. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ కాలనీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన మామిడాల రాజా వెంకటరమణ (54) మంచిర్యాల విద్యాశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ భార్య, కుమారుడితో కలిసి అక్కడే ఉంటున్నారు. 
 
అయితే, గత ఐదు రోజులుగా ఆయన జ్వరం, జలుబుతో బాధపడుతూ వచ్చాడు. దీంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నారు. పరీక్షించిన వైద్యుడు ఎందుకైనా మంచిదని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. 
 
దీంతో ఆయన భయపడిపోయారు. తనకు ఖచ్చితంగా కరోనా సోకివుంటుందని అనుమానించిన వెంకటరమణ.. అదే రోజు సాయంత్రం వరకు విధులు నిర్వర్తించి, అక్కడి నుంచి ఇంటికి వెళ్లకుండా నేరుగా కరీంనగర్‌లో తన ఇంటికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఉదయం విధులకు వెళ్లిన తండ్రి రాత్రయినా ఇంటికి రాకపోవడంతో అనుమానించిన ఆయన కుమారుడు విశ్వజిత్ కరీంనగర్‌లోని బంధువులకు ఫోన్‌లో విషయం చెప్పాడు. వారు అతడి ఇంటికి వెళ్లి చూడగా వెంకటరమణ ఉరికి వేలాడుతూ కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు.. పుకార్లు సృష్టించవద్దు : నాగబాబు

Naveen Chandra: మర్డర్ మిస్టరీ నేపథ్యంలో నవీన్ చంద్ర షో టైం రాబోతోంది

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments