Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కరోనా కల్లోలం... అనేక మందికి పాజిటివ్

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (17:09 IST)
హైదరాబాద్ నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఈ రెండు ఆస్పత్రులకు చెందిన సిబ్బందిలో అనేక మంది ఈ వైరస్ బారినపడ్డారు. అలాగే, పలువురు వైద్య, నర్సింగ్ విద్యార్థులు కూడా ఉన్నారు. 
 
గాంధీ ఆస్పత్రి అనుబంధ వైద్య కాలేజీలో 20 మందికి ఎంబీబీఎస్ విద్యార్థులకు పాజిటివ్ అని తేలింది. అలాగే 10 మంది హౌస్ సర్జన్లు, 10 మంది పీజీ విద్యార్థులు, నలుగురు ఫ్యాకల్టీ సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో పాటు ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థుల్లో 44 మంది కోవిడ్ బారినపడ్డారు. 
 
ఇక ఉస్మానియా ఆస్పత్రిలోనూ కరోనా కలకలం చెలరేగింది. ఉస్మానియాలోని 19 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు, 35 మంది హౌస్ సర్జన్లకు, 23 మంది జూనియర్ వైద్యులకు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఈ వైరస్ సోకింది. ఉస్మానియా వైద్య వర్గాల సమాచారం మేరకు ఈ ఆస్పత్రిలో మొత్తం 79 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో గాంధీ, ఉస్మానియా వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments