Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ పాల ప్యాకెట్ల ద్వారా వస్తుందా?

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (23:46 IST)
ఇపుడు కరోనావైరస్ ఏ వస్తువు ద్వారా వస్తుందోనన్న భయం చాలామందిలో వుంది. కూరగాయలు తెచ్చుకుని వాటిని పసుపు, ఉప్పు కలిపిన నీళ్లలో వేసి కొందరు కడుతున్నారు. మరికొందరు శానిటైజర్లతో కడిగే ప్రయత్నం చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అన్నింటికీ మించి పాల ప్యాకెట్లతో కరోనావైరస్ వస్తుందోమోనన్న భయంతో చాలామంది వాటిని శానిటైజర్ కలిపిన నీళ్లలో వేసి కడిగి తీసుకుంటున్నారు. ఐతే పాల ప్యాకెట్లను ఇలా శానిటైజర్‌తో కడగడం ఆరోగ్యానికి ప్రమాదం.
 
మరేం చేయాలి? అంటే... పాల ప్యాకెట్లను తీసుకున్న తర్వాత మీ చేతులను సబ్బుతో బాగా శుభ్రంగా కడగండి. ఆ తర్వాత పాల ప్యాకెట్‌ను నీటిలో కడగండి. ప్యాకెట్లను శానిటైజర్లతో కాని డిటర్జెంట్‌తో కాని కడగాల్సిన పనిలేదు. కడిన తర్వాత ఆ నీళ్లు పాల పాత్రలోకి రాకుండా ఉండటానికి ప్యాకెట్‌ను కాసేపు పక్కన పెట్టేయండి. ఈ పాల ప్యాకెట్ పైన వున్న నీళ్లను తుడిచేందుకు ఇంట్లోని కిచెన్ టవల్‌ను ఉపయోగించవద్దు.
 
కొద్దిగా నీళ్లు ప్యాకెట్ పై నుంచి పోయాక మళ్లీ మీ చేతులను కడుక్కొని ప్యాకెట్‌ను జాగ్రత్తగా కత్తిరించి పాత్రలో పోసి పాలను వేడి చేయండి. అంతే పాలు సురక్షితంగా మీకు చేరినట్లే. ఐతే పాల ప్యాకెట్లు వేసేవారు మాస్కులు కట్టుకుంటున్నారో లేదో చూడండి. ఒకవేళ వారు ధరించనట్లయితే వాటిని ధరించాలని చెప్పండి. అలాగే ప్యాకెట్ తీసుకునే సమయంలో భౌతిక దూరం పాటించండి.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments