కరోనావైరస్ పాల ప్యాకెట్ల ద్వారా వస్తుందా?

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (23:46 IST)
ఇపుడు కరోనావైరస్ ఏ వస్తువు ద్వారా వస్తుందోనన్న భయం చాలామందిలో వుంది. కూరగాయలు తెచ్చుకుని వాటిని పసుపు, ఉప్పు కలిపిన నీళ్లలో వేసి కొందరు కడుతున్నారు. మరికొందరు శానిటైజర్లతో కడిగే ప్రయత్నం చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అన్నింటికీ మించి పాల ప్యాకెట్లతో కరోనావైరస్ వస్తుందోమోనన్న భయంతో చాలామంది వాటిని శానిటైజర్ కలిపిన నీళ్లలో వేసి కడిగి తీసుకుంటున్నారు. ఐతే పాల ప్యాకెట్లను ఇలా శానిటైజర్‌తో కడగడం ఆరోగ్యానికి ప్రమాదం.
 
మరేం చేయాలి? అంటే... పాల ప్యాకెట్లను తీసుకున్న తర్వాత మీ చేతులను సబ్బుతో బాగా శుభ్రంగా కడగండి. ఆ తర్వాత పాల ప్యాకెట్‌ను నీటిలో కడగండి. ప్యాకెట్లను శానిటైజర్లతో కాని డిటర్జెంట్‌తో కాని కడగాల్సిన పనిలేదు. కడిన తర్వాత ఆ నీళ్లు పాల పాత్రలోకి రాకుండా ఉండటానికి ప్యాకెట్‌ను కాసేపు పక్కన పెట్టేయండి. ఈ పాల ప్యాకెట్ పైన వున్న నీళ్లను తుడిచేందుకు ఇంట్లోని కిచెన్ టవల్‌ను ఉపయోగించవద్దు.
 
కొద్దిగా నీళ్లు ప్యాకెట్ పై నుంచి పోయాక మళ్లీ మీ చేతులను కడుక్కొని ప్యాకెట్‌ను జాగ్రత్తగా కత్తిరించి పాత్రలో పోసి పాలను వేడి చేయండి. అంతే పాలు సురక్షితంగా మీకు చేరినట్లే. ఐతే పాల ప్యాకెట్లు వేసేవారు మాస్కులు కట్టుకుంటున్నారో లేదో చూడండి. ఒకవేళ వారు ధరించనట్లయితే వాటిని ధరించాలని చెప్పండి. అలాగే ప్యాకెట్ తీసుకునే సమయంలో భౌతిక దూరం పాటించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబైలో షూటింగ్ - చెన్నైలో ఫుడ్ ఆర్డర్.. ఫ్లైట్‌లో డెలివరీ.. ప్రభాస్ మామూలోడు కాదండోయ్..

promo of Aara of Ustad: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆరా ఆఫ్ ఉస్తాద్ ప్రోమో వచ్చేసింది

Hey Balwant review: హే భగవాన్ పేరు మారిన హే బలవంత్ మూవీ రివ్యూ

రష్మిక-విజయ్ వివాహం.. బందోబస్తు కోసం అంతర్జాతీయ భద్రతా సంస్థ

మా పూర్వీకులు భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారు: విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

తర్వాతి కథనం
Show comments