Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్రకు కరోనా... వైకాపా పంతం నెరవేరినట్టేనా?

Webdunia
గురువారం, 6 మే 2021 (08:50 IST)
సంగం డైరీ అక్రమాల కేసులో అరెస్టు అయిన టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్రకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన్ను జైలు నుంచి ఆస్పత్రికి తరలించనున్నారు. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉంటున్న ఆయన్ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ధూళిపాళ్లతో ఆ సంస్థ మేజింగ్ డైరెక్టర్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణ తొలుత కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
జైలులో ఉన్న నరేంద్ర జ్వరం, జలుబుతో బాధపడుతుండడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు న్యాయవాది ద్వారా కోర్టులో పిటిషన్ వేశారు. 
 
స్వీకరించిన న్యాయస్థానం నరేంద్రకు ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించి చికిత్స అందించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఆయనకు పరీక్షలు చేయించగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments