Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకవైపు కరోనా.. మరోవైపు భయపెడుతున్న డెంగ్యూ..

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (20:25 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు కరోనా కోరలు చాస్తుండగా.. మరోవైపు డెంగ్యూ భయపెడుతుంది. ఇప్పటికే డెంగ్యూ వ్యాధికి గురై పలువురు చనిపోయినట్లు సమాచారం. ఢిల్లీలో మూడేళ్ల నాటి డెంగ్యూ రికార్డులు బద్ధలవుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో డెంగ్యూ విస్తరిస్తుంది. గత మూడు నాలుగు రోజులుగా డెంగ్యూ విస్తరిస్తుండటంతో అనేక మంది దవాఖానాల పాలవుతున్నారు. 
 
డెంగ్యూ కారణంగా ఇప్పటికే పలువురు మరణించినట్లు చెప్తున్నారు. 2018 తర్వాత అత్యధికంగా డెంగ్యూ రోగులు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. గత వారంలో కొత్తగా నలుగురు డెంగ్యూతో చనిపోగా మొత్తం చనిపోయిన వారి సంఖ్య 13కు చేరుకుంది. 2016, 2017లలో 10 మంది చొప్పున రోగులు చనిపోగా.. 2018 సంవత్సరంలో నలుగురు, ​​2019 లో ఇద్దరు రోగులు మృత్యువాత పడ్డారు. 2015లో అత్యధికంగా 60 మంది చనిపోయారు.
 
ఇదే సమయంలో మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు గణనీయంగా వ్యాప్తి చెందకపోవడం ఉపశమనం కలిగించే విషయం. గత వారంలో మలేరియా రోగులు ఎవరూ నమోదు కాలేదు. ఈ ఏడాది మొత్తం మలేరియా రోగుల సంఖ్య నాలుగుకు పెరుగగా, చికున్‌గున్యా రోగుల సంఖ్య మూడుకి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments