Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మహిళా డాక్టర్‌కు కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (15:32 IST)
ఢిల్లీలో ఓ మహిళా వైద్యురాలికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. ఈ మహిళా వైద్యురాలు ఢిల్లీ కేన్సర్ ఆస్పత్రిలో పని చేస్తూవస్తోంది. ఈమె ఇటీవలే తన సోదరుడి ఇంటికి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆమెకు కరోనా నిర్ధారణ అయింది. 
 
అయితే వైద్యురాలి సోదరుడు ఇటీవలే యూకే నుంచి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వైద్యురాలికి కరోనా సోకడంతో.. బుధవారం ఆమె పని చేస్తున్న ఆస్పత్రిని మూసివేశారు. ఇక ఆస్పత్రి సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
 
మరోవైపు, ఢిల్లీలో ఇప్పటివరకు 120 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో కరోనా అనుమానిత లక్షణాలతో 750 మంది చేరినట్టు తెలిపారు. ఒక్కరు మాత్రమే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని చెప్పారు. లోక్‌నాయక్‌, రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 1000 పడకలు సిద్ధం చేశామని సత్యేందర్‌ జైన్‌ ప్రకటించారు. 
 
ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విజృంభిస్తున్న‌ది. మంగ‌ళవారం ఒక్క‌రోజే అక్క‌డ కొత్త‌గా 23 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని తెలిపారు. కాగా, కరోనా సోకిన 120 మందిలో ఐదుగురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యార‌ని, ఇద్ద‌రు మ‌ర‌ణించార‌ని, మ‌రో వ్య‌క్తి విదేశాల‌కు వెళ్లిపోయాడ‌ని ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments