Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విధుల్లో మరణిస్తే భారీ పరిహారం : కేజ్రీవాల్ ఉదారం

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (15:25 IST)
కరోనా విధుల్లో నిమగ్న విధులు నిర్వహిస్తున్న వారు మరణించే వారి కుటుంబాలకు భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేయనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ బారినపడుతున్న వారికి వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్యకార్మికులు రేయింబవుళ్లు సేవలు అందిస్తున్నారు. 
 
ఇలాంటివారిపై ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఉదార స్వభావాన్ని చూపించారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా పని చేస్తున్న శానిటైజేషన్‌ వర్కర్లు, కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు, నర్సులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. 
 
శానిటైజేషన్‌ వర్కర్లు, డాక్టర్లు, నర్సుల సేవలను గౌరవించి.. రూ.కోటి పరిహారాన్ని అందజేస్తామన్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న శానిటైజేషన్‌ వర్కర్లు, డాక్టర్లు, నర్సులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కాగా, ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 121కు చేరింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్‌ నుంచి 6 మంది కోలుకున్నారు. 

 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments