డీడీ న్యూస్‌ను తాకిన కరోనా వైరస్ ప్రభావం..

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (18:07 IST)
కరోనాతో ప్రపంచదేశాలు విలవిలలాడుతున్నాయి. కరోనా సోకిన వారి సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది. రోజూ వందల మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ న్యూస్ ఛానెల్‌కు చెందిన వీడియో జర్నలిస్ట్ కరోనా వల్ల చనిపోయాడు. దీంతో అప్రమత్తమైన డీడీ న్యూస్ ఛానెల్ యాజమాన్యం ఆ ఛానెల్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
 
ఢిల్లీలోని దూరదర్శన్ న్యూస్ ఛానెల్‌లో వీడియో జర్నలిస్ట్‌గా పని చేస్తున్న యోగేశ్ కుమార్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. అయితే అనుమానంతో అతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ అని తేలింది. ఫలితంగా ఆ ఛానెల్‌లోని అదే విభాగంలో పనిచేస్తున్న మొత్తం సిబ్బందికి కరోనా పరీక్షలు చేయనున్నారు. డీడీ న్యూస్ ఛానెల్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
 
ఆఫీస్‌ను శానిటైజేషన్ చేసిన తర్వాత త్వరలోనే తెరుస్తామని, అలాగే ఆఫీస్ మూతపడటం వల్ల వార్తాప్రసారాలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నట్లు ఆ ఛానెల్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు. వీడియో జర్నలిస్ట్ యోగేష్ మృతితో కెమెరా విభాగానికి చెందిన సిబ్బంది మొత్తాన్ని డాక్టర్ రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆ ఛానెల్ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments