Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి నుంచి 50 ఏళ్లకు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్.. హర్షవర్ధన్

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (12:46 IST)
కేంద్ర ప్రభుత్వం దశల వారీగా కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందజేస్తున్న సంగతి తెలిసిందే. తొలి విడత వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది, భద్రతా బలగాలకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మార్చి నుంచి దేశవ్యాప్తంగా 50 ఏళ్లకు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. 
 
మొదటి, రెండో దశ వ్యాక్సినేషన్ ముగిసిన వెంటనే వృద్ధులకు కరోనా వ్యాక్సిన్ అందించే ప్రక్రియ ప్రారంభం అవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించారు. ఈ మేరకు లోక్ సభలో వెల్లడించారు. 50 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం మార్చిలో ఎప్పుడైనా ప్రారంభం కావొచ్చని అన్నారు.
 
కాగా, కరోనా వ్యాక్సిన్ల కోసం భారత్‌కు పలు దేశాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయని, వీటిలో 15 దేశాలకు గ్రాంట్ సహాయం కింద 56 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపామని, కాంట్రాక్టు కింద 105 లక్షల డోసులు అందించామని డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. కరోనా వ్యాక్సినేషన్, ఇతర చర్యల కోసం కేంద్రం ఇటీవల బడ్జెట్‌లో రూ.35 వేల కోట్లు కేటాయించిందని, అవసరమైన పక్షంలో ఆ మొత్తం పెంచుతామని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments