Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్.. పూరీ జగన్నాథ ఆలయం మూసివేత.. మే 15 వరకు..?

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (21:58 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం మూతపడింది. రోనా ఇన్‌ఫెక్షన్‌ కారణంగా పూరి జగన్నాథ్ ఆలయంలో వివిధ సమస్యలు తలెత్తుతాయని, ఇక్కడికి వచ్చే భక్తులతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని ఆలయం బోర్డు అభిప్రాయపడింది. దీంతో ఆలయాన్ని మే 15 వరకు మూసివుంచనున్నట్లు అధికారులు తెలిపారు. 
 
పూరీ జగన్నాథ్ ఆలయంలో భక్తుల రాకను నిషేధించారని, రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా పూర్తవుతాయని సేవకులు తెలిపారు. మహాప్రభు చందన్ యాత్ర, అక్షయ తృతీయ, స్నాన్ యాత్ర, ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర రాబోయే రోజుల్లో జరుగనున్నాయి. అటువంటి పరిస్థితుల్లో బ్రేక్ వర్తించకపోతే ఇన్‌ఫెక్షన్ పెరిగిపోయి అసలుకే ముప్పు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
 
మరోవైపు, సాంప్రదాయం ప్రకారం ఈ ఏడాది రథం నిర్మాణ పనుల కొనసాగింపును మే 15 న అక్షయ తృతీయ రోజున ప్రారంభించనున్నారు. ఆలయంలో సేవకులకు మాస్క్‌లు, శానిటైజర్లు ఏర్పాటు చేయనున్నా. చందనం, స్నానం, రథయాత్ర కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్నది. పూరి జిల్లాలో శుక్రవారం 395 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments