దేశంలో గణనీయంగా తగ్గిన క్రియాశీలక కేసులు

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (13:11 IST)
దేశంలో ఒకవైపు కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి కోసం ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మరోవైపు దేశంలో గత కొన్ని రోజులుగా 20 వేల లోపే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ నివేదిక ప్రకారం.. నిన్న దేశవ్యాప్తంగా 8,36,227 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 15,968 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. 
 
దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి నాలుగు లక్షల 95వేలకు చేరింది. వీరిలో ఇప్పటివరకు 1,01,29,111 మంది కోలుకోగా, నిన్న ఒక్కరోజే 17,817 మంది డిశ్ఛార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 202 కొవిడ్‌ మరణాలు నమోదుకావడంతో మొత్తం మృతుల సంఖ్య 1,51,529కి చేరింది. ప్రస్తుతం 2,14,507 క్రియాశీల కేసులు(2.04శాతం) ఉన్నాయి.
 
మరోవైపు, కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు అలసత్వం వహించకూడదని కేంద్ర ఆరోగ్యశాఖ దేశ ప్రజలకు సూచించింది. వ్యాక్సిన్‌ తీసుకున్నాక 14 రోజుల తర్వాతే వాటి ప్రభావం ప్రారంభం అవుతుండడంతో అప్పటివరకు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరింది. 
 
రెండు డోసుల వ్యాక్సిన్‌ను 28 రోజుల వ్యవధిలో తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా జనవరి 16నుంచి వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఇందుకోసం అవసరమైన వ్యాక్సిన్లను గట్టి భద్రత నడుమ, సురక్షితంగా అన్ని రాష్ట్రాలకు చేరవేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా హీరో కోట్లు ఇచ్చినా తప్పు చేయడు... రూ.40 కోట్ల వదులుకున్న పవర్ స్టార్

అనసూయకు గుడికడతాం... అనుమతి ఇవ్వండి... ప్లీజ్

'రణబాలి'గా విజయ్ దేవరకొండ.. ఏఐ వాడలేదంటున్న దర్శకుడు

చిత్రపరిశ్రమలో కమిట్మెంట్ అంటే అర్థం వేరు .. ఓ పెద్దాయన అలా ప్రవర్తించారు : గాయని చిన్మయి

కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్: చిరంజీవి గారు వేరే తరం నుండి వచ్చారు.. ఇప్పుడు పరిస్థితి వేరు.. చిన్మయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments