దేశంలో గణనీయంగా తగ్గిన క్రియాశీలక కేసులు

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (13:11 IST)
దేశంలో ఒకవైపు కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి కోసం ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మరోవైపు దేశంలో గత కొన్ని రోజులుగా 20 వేల లోపే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ నివేదిక ప్రకారం.. నిన్న దేశవ్యాప్తంగా 8,36,227 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 15,968 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. 
 
దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి నాలుగు లక్షల 95వేలకు చేరింది. వీరిలో ఇప్పటివరకు 1,01,29,111 మంది కోలుకోగా, నిన్న ఒక్కరోజే 17,817 మంది డిశ్ఛార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 202 కొవిడ్‌ మరణాలు నమోదుకావడంతో మొత్తం మృతుల సంఖ్య 1,51,529కి చేరింది. ప్రస్తుతం 2,14,507 క్రియాశీల కేసులు(2.04శాతం) ఉన్నాయి.
 
మరోవైపు, కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు అలసత్వం వహించకూడదని కేంద్ర ఆరోగ్యశాఖ దేశ ప్రజలకు సూచించింది. వ్యాక్సిన్‌ తీసుకున్నాక 14 రోజుల తర్వాతే వాటి ప్రభావం ప్రారంభం అవుతుండడంతో అప్పటివరకు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరింది. 
 
రెండు డోసుల వ్యాక్సిన్‌ను 28 రోజుల వ్యవధిలో తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా జనవరి 16నుంచి వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఇందుకోసం అవసరమైన వ్యాక్సిన్లను గట్టి భద్రత నడుమ, సురక్షితంగా అన్ని రాష్ట్రాలకు చేరవేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్న మూవీ పరిశ్రమలో నిలిచిపోతుంది : హీరో కార్తిక్ శివన్

Lavanya: లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి రిలీజ్‌ కు సిద్ధం

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెకు వేధింపులు.. ఒకరి అరెస్టు

Rajanikanth: రజినీకాంత్ భాషా చిత్రం చిరంజీవి ఎలా మిస్ అయ్యారో తెలుసా !

Pawan Kalyan: జానీ కి ముందే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం దెబ్బతింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మలేరియా దినోత్సవం- గర్భధారణ సమయంలో మలేరియా.. గుర్తించకపోతే...?

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు

ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే

తర్వాతి కథనం
Show comments