Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో 96 లక్షలు దాటిన కరోనా వైరస్ కేసులు!

దేశంలో 96 లక్షలు దాటిన కరోనా వైరస్ కేసులు!
, శనివారం, 5 డిశెంబరు 2020 (10:07 IST)
దేశంలో కరోనా కేసుల సంఖ్య 96 లక్షలు దాటిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఆరోగ్య బులిటెన్‌లో ఈ విషయం వెల్లడైంది. పైగా, గడచిన 24 గంటల్లో 36,652 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,08,211కి చేరింది. ఇక గత 24 గంటల్లో 42,533 మంది కోలుకున్నారు.
 
ముఖ్యంగా, గత 24 గంట‌ల్లో 12 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,39,700కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 90,58,822 మంది కోలుకున్నారు. 4,09,689 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
అలాగే, తెలంగాణలో గత 24 గంటల్లో 596 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శనివారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 802 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,72,719కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,62,751 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,470కి చేరింది. 
 
తెలంగాణలో ప్రస్తుతం 8,498 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 6,465 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 102, రంగారెడ్డి జిల్లాలో 46 కరోనా కేసులు నమోదయ్యాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీహెచ్ఎంసీ మేయర్ పదవి మహిళకే.. రేసులో ఆదర్శ్ రెడ్డి..?